KTR: కేసీఆర్‌ను ఓడించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు.. పందులే గుంపులుగా వస్తాయ్: కేటీఆర్

KTR participated election campaign in vemulawada

  • వేములవాడ ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
  • సింహం సింగిల్‌గానే వస్తుందన్న మంత్రి కేటీఆర్
  • డీకే శివకుమార్ వచ్చి మన నెత్తిన పాలు పోశాడని వ్యాఖ్య
  • కేసీఆర్ అంటే తెలంగాణ భరోసా అన్న కేటీఆర్
  • బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే వేములవాడకు మళ్లీ వస్తానన్న మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని, కానీ కేసీఆర్ సింహం అని, సింగిల్‌గానే వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. పందులు గుంపులుగా వస్తాయన్నారు. సోమవారం ఆయన వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదని, బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అనీ అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి మన నెత్తిన పాలు పోశారన్నారు. ఎందుకంటే అక్కడ ఐదు గంటల విద్యుత్ అని చెప్పాడని, కానీ మనం ఇక్కడ 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు.

ఐదు గంటల విద్యుత్ అని ఆయన చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు వారిని మళ్లీ ప్రచారానికి పిలవడం లేదన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3వ తేదీన చూద్దామన్నారు. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదన్నారు.

తెలంగాణ భవిష్యత్తు ఇంకా ఢిల్లీలోనే నిర్ణయం కావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే తెలంగాణ భరోసా అన్నారు. సెంటిమెంట్లకు, అపాయింటుమెంట్లకు లొంగవద్దన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ వేములవాడకు వస్తానని, లేదంటే ఇక్కడకు రానని కేటీఆర్ అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనర్సింహారావును గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు.

  • Loading...

More Telugu News