Budda Venkanna: జడ్జిలను తిట్టారంటూ... బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

CID send notice to Budda Venkanna

  • వైద్య పరీక్షల కోసం హైదరాబాదులో ఉన్న బుద్దా
  • హైదరాబాద్ వచ్చి నేరుగా బుద్దాకు నోటీసులు అందించిన సీఐడీ
  • ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చామన్న అధికారులు

జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.

  • Loading...

More Telugu News