KCR: కేసీఆర్ నియోజకవర్గ పర్యటనల్లో స్వల్ప మార్పులు

Small changes in kcr tour

  • ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తి సభలో పాల్గొననున్న కేసీఆర్
  • 27న స్టేషన్ ఘనపూర్‌కు బదులు మహబూబాబాద్, వర్ధన్నపేట సభలకు కేసీఆర్
  • మిగిలిన పర్యటనలు యథాతథం

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్... నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తిలో, 27న స్టేషన్ ఘనపూర్‌కు బదులు మహబూబాబాద్, వర్దన్నపేటలలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగిలినవి యథాతథంగా కొనసాగుతాయి. కేసీఆర్ ఈ నెల 15న మేనిఫెస్టోను ప్రకటించారు. అదే రోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున చుట్టి వస్తున్నారు. హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో విరామం ఇచ్చారు. గురువారం నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News