CEC: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..!

Five states Elections polling dates details

  • ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
  • పోలింగ్ తేదీలు వేర్వేరు.. ఫలితాలు మాత్రం డిసెంబర్ 3
  • నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు పోలింగ్

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈమేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలలో పోలింగ్ తేదీలు వేర్వేరుగా ప్రకటించిన సీఈసీ.. ఫలితాలు మాత్రం అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న వెలువరించనున్నట్లు తెలిపింది.

ఏ రాష్ట్రంలో పోలింగ్ ఎప్పుడంటే..

నవంబర్ 7: మధ్యప్రదేశ్ (230 సీట్లు), మిజోరం (90 సీట్లు), ఛత్తీస్ గఢ్ (90 సీట్లు) (తొలి విడత) పోలింగ్
నవంబర్ 17: ఛత్తీస్ గఢ్ (రెండో విడత)
నవంబర్ 23: రాజస్థాన్ (200 సీట్లు)
నవంబర్ 30: తెలంగాణ (119 సీట్లు)

కౌంటింగ్, ఫలితాల ప్రకటన: డిసెంబర్ 3 (ఐదు రాష్ట్రాల ఫలితాలు ఒకే రోజు)

CEC
Elections
Assembly Elections
Five states
Election Schedule
  • Loading...

More Telugu News