Angallu Case: అంగళ్లు అల్లర్ల కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Backlash to AP Govt in Supreme Court in Angallu case
  • దేవినేని, చల్లాబాబు సహా పలువురికి హైకోర్టు బెయిల్
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. 

ఈ కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా ఈరోజు ఇదే ధర్మాసనం విచారణ జరపబోతోంది.
Angallu Case
Supreme Court
AP Govt

More Telugu News