Nara Lokesh: జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది: నారా లోకేశ్

Nara Lokesh take a swipe at CM Jagan

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని ఆగ్రహం
  • జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వెల్లడి
  • సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడే జగన్ పిచ్చి కుదురుతుందని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. అధికార మదమెక్కిన జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వ్యాఖ్యానించారు. సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని లోకేశ్ వివరించారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనుండడం తెలిసిందే.

Nara Lokesh
Jagan
Chandrababu
Arrest
TDP
YSRCP
  • Loading...

More Telugu News