YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన గౌతమ్ అదానీ.. ఇద్దరూ కలిసి డిన్నర్!

Gautam Adani meets AP CM YS Jaganmohan Reddy

  • గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు రాక
  • నేరుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అదానీ
  • వివిధ అంశాలపై చర్చించిన జగన్-అదానీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ చేయనున్నారు.

  • Loading...

More Telugu News