Manipur Violence: మణిపూర్‌లో మరో దారుణం.. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థుల హత్య.. వారి వెనక సాయుధులున్న ఫొటోలు వైరల్!

In Manipur Horror Pics Show 2 Students Killed

  • జులైలో కిడ్నాపైన ఇద్దరు విద్యార్థులు
  • అప్పటి నుంచీ వెతుకుతున్న సీబీఐ
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
  • మణిపూర్‌లో ఇప్పటి వరకు 180 మంది మృతి

మణిపూర్‌లో హింసకు అడ్డుకట్ట పడటంలేదు. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మెయిటీ తెగకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హిజమ్ లింతోయింగంబి (17), ఫిజమ్ హెమిజిట్ (20) ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో ఫొటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడి ఉన్నారు. 

ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో మరోమారు నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును ఇప్పటికే పర్యవేక్షిస్తున్న సీబీఐ వారి జాడను గుర్తించడంలో విఫలమైంది. హత్యకు గురైన ఈ ఇద్దరు విద్యార్థులు జులైలో ఓ షాపులో వున్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. ఆ తర్వాతి నుంచి వారి జాడ కనిపించలేదు. వారు హత్యకు గురైన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల కిడ్నాప్, హత్య వెనక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ప్రజలు సంయమనం పాటించాలని, దర్యాప్తు సంస్థలను వాటి పని చెయ్యనివ్వాలని కోరింది. మణిపూర్‌లో మే 3న మొదలైన హింసలో ఇప్పటి వరకు 180 మంది మృతి చెందారు. వేలాదిమంది రాష్ట్రాన్ని విడిచిపెట్టారు.

Manipur Violence
Meiteis
Kuki Tribes
CBI
  • Loading...

More Telugu News