Andhra Pradesh: గ్రామాల్లో కుక్కల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారు.. టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

Deputy CM Sensational Comments

  • అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద కామెంట్స్
  • చంద్రబాబు అరెస్టుపై దద్దరిల్లుతున్న ఏపీ అసెంబ్లీ
  • పోడియం వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ వారు పట్టుబడుతున్నారు. అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే రిలీజ్ చేయాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. పోడియం వద్దకు వెళ్లకుండా నిలవరించారు.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సభలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఊర కుక్కలతో పోల్చారు. గ్రామాల్లో కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి విమర్శించారు. దీనిపై సభలో మరింత గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది.

Andhra Pradesh
Deputy CM
AP Assembly Session
TDP
  • Loading...

More Telugu News