Nara Lokesh: జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh thanked Janasena and CPI workers

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ
  • నేటి బంద్ లో పాలుపంచుకున్న జనసేన, సీపీఐ కార్యకర్తలు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ చేపట్టిన బంద్ లో టీడపీ శ్రేణులతో పాటు జనసేన, సీపీఐ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసనలపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల సూచనలు, సలహాల మేరకు తదుపరి కార్యాచరణకు ప్రణాళిక రూపొందించారు. 

ఈ సందర్భంగా, తమకు మద్దతిచ్చిన జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ నిరసనలను అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుతున్నారని ఆరోపించారు. 

కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలు సమీపంలోని విద్యానగర్ క్యాంప్ సైట్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News