IND vs PAK: చుక్కలనంటిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధర

Fans vexed after price of IND vs PAK World Cup tickets explodes to INR 57 lakhs

  • అక్టోబర్ 14 నాటి మ్యాచ్ టికెట్ ధర రూ.57 లక్షలు
  • కనిష్ఠ ధర రూ.57,198
  • సెకండరీ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితి
  • టికెట్ల బ్లాక్ మార్కెట్ అంటూ మండి పడుతున్న అభిమానులు

వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ టికెట్ కోసం తెగపోటీ నెలకొంది. ఒక టికెట్ ధర రూ.57 లక్షలకు చేరిందంటే అభిమానుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించి అన్ని వార్మప్, లీగ్ దశ మ్యాచ్ టికెట్ల విక్రయాలు సెప్టెంబర్ 3న ముగిశాయి. ఆగస్ట్ 25 నుంచి 29వ తేదీ వరకు మాస్టర్ కార్డ్ యూజర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు టికెట్లను బుక్ మై షో ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 

దీంతో సెకండరీ మార్కెట్లో క్రికెట్ మ్యాచ్ ల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. లైవ్ మ్యాచ్ ల సెకండరీ టికెట్ల విక్రయ వేదిక ‘వైగోగో’లో టికెట్ల ధరలు భారీ స్థాయికి చేరాయి. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధర రూ.41,118 నుంచి రూ.1.67 లక్షల మధ్య పలుకుతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.57,198 పలుకుతుంటే, గరిష్ఠ ధర రూ.57.15 లక్షలకు చేరింది. ఈ ధరలు చూసి క్రికెట్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టికెట్లకు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ ఏర్పడినట్టు విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News