Team India: ఆసియా కప్: నేపాల్ పై టాస్ గెలిచిన టీమిండియా

Team India has won the toss and elected bowl first against Nepal in Asia Cup

  • ఆసియా కప్ లో నేడు భారత్ వర్సెస్ నేపాల్
  • శ్రీలంకలోని పల్లెకెలెలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ఆసియా కప్ లో టీమిండియా నేడు నేపాల్ తో తలపడుతోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ వర్షార్పణం అయిన నేపథ్యంలో, ఈ మ్యాచ్ లో భారత్ కు గెలుపు తప్పనిసరి. శ్రీలంకలోని పల్లెకెలె మైదానం ఈ గ్రూప్-ఏ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ బుమ్రా లేకుండానే బరిలో దిగుతోంది. బుమ్రా భార్య సంజనా గణేశన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఈ మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉండడంలేదు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. అటు, నేపాల్ టీమ్ కు కూడా ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఆ జట్టు పాకిస్థాన్ చేతిలో 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

  • Loading...

More Telugu News