New Delhi: రెండు బస్సుల మధ్య తల చితికి యువతి దుర్మరణం.. కిటికీలోంచి తల బయటపెట్టగా దారుణం

Woman Sticks Head Out Of Bus To Vomit Gets Crushed By Another Vehicle

  • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
  • వాంతి చేసుకునేందుకు బస్సు కిటికీలోంచి తల బయటపెట్టిన యువతి
  • అదే సమయంలో మరో బస్సు ఓవర్ టేకింగ్ యత్నం
  • రెండు బస్సుల మధ్య యువతి తల నలగడంతో బాధితురాలి దుర్మరణం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రెండో బస్సు కోసం తీవ్రంగా గాలింపు

బస్సు ప్రయాణంలో ఉండగా ఓ 20 ఏళ్ల యువతి అనూహ్య రీతిలో మరణించింది. వాంతి చేసుకునేందుకు బస్సు కిటికీలోంచి ఆమె తల బయటపెట్టడంతో రెండు బస్సుల మధ్య చిక్కి దుర్మరణం చెందింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌కు చెందిన బాబ్లీ అనే యువతి(20) తన సోదరి, ఆమె భర్త వారి ముగ్గురు పిల్లలతో కలిసి లూథియానా వెళ్లేందుకు కశ్మీర్ గేటు వద్ద హర్యానా రోడ్ వేస్‌ సంస్థ బస్సు ఎక్కింది. కాగా, అలీపూర్ ప్రాంతానికి రాగానే ఆమెకు వాంతి రావడంతో కిటికీలోంచి తల బయటపెట్టింది. అదే సమయంలో మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండటంతో రెండు బస్సుల మధ్య ఆమె తల నలిగి దుర్మరణం చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండో బస్సు కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News