NTPC: విశాఖ పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం... ఇద్దరి మృతి

Two labour died in Visakha NTPC incident

  • సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణపనులు
  • తెగిపోయిన బెల్ట్
  • 15 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన కార్మికులు
  • ముగ్గురి పరిస్థితి విషమం

విశాఖపట్నం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందినవారిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News