Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.62 శాతం పతనమైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అమెరికా జాబ్ డేటా, ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ఉన్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 65,846కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 19,570 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.82%), విప్రో (1.34%), బజాజ్ ఫైనాన్స్ (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.89%), యాక్సిస్ బ్యాంక్ (0.58%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.88%), సన్ ఫార్మా (-0.87%).

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News