Uttar Pradesh: యూపీలో మరో దారుణం.. బాలికను వేధించి శానిటైజర్ తాగించిన యువకులు.. బాలిక మృతి

Teen girl dies after being forced to drink sanitiser for resisting molestation bid

  • స్కూలు నుంచి వస్తున్న బాలికను అడ్డుకుని వేధింపులు
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె సోదరుడిపైనా దాడి
  • మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వైనం

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుస ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా కొందరు యువకులు ఓ బాలికను వేధించి ఆమె ప్రాణాలు తీశారు. బరేలీకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని గత నెల 27న స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అడ్డుకుని వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు.

అదే సమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడిచేశారు. ఆ తర్వాత  బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News