Team India: రెండో వన్డేలో టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్

Team India all out for 181 runs in 2nd ODI

  • బ్రిడ్జ్ టౌన్ లో టీమిండియా వర్సెస్ విండీస్
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన కరీబియన్లు
  • 40.5 ఓవర్లలో 181 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
  • చెరో 3 వికెట్లు పడగొట్టిన రొమారియో షెపర్డ్, గుడాకేశ్ మోతీ

బ్రిడ్జ్ టౌన్ లో వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే విండీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్ మాన్ గిల్ (34) తొలి వికెట్ కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్ మెన్ ఆ ఒరవడి కొనసాగించలేకపోయారు. ఓ దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోగా, వర్షం తగ్గి మ్యాచ్ మళ్లీ మొదలైనా భారత్ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. 

మిడిలార్డర్ లో సూర్యకుమార్ 24 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 16, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. సంజు శాంసన్ (9), అక్షర్ పటేల్ 1, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ 3, రొమారియో షెపర్డ్ 3, అల్జారీ జోసెఫ్ 2, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News