Telangana: రైలు చక్రాలకూ సిబ్బంది తాళం!

Train wheels tied to tracks in kazipet station

  • భారీ వర్షాలకు గురువారం ఉద్ధృతంగా ప్రవహించిన వడ్డేపల్లి చెరువు
  • ముందు జాగ్రత్తగా గూడ్స్‌ రైలు కాజీపేట టౌన్ స్టేషన్‌లో నిలిపివేత
  • రైలు బ్రేకులను లాక్ చేసి, చక్రాలను గొలుసుతో పట్టాలకు కట్టేసిన సిబ్బంది

ఇళ్లు, భవనాలు, గోదాములు.. ఇలా ఎన్నింటికో తాళాలు వేయడం మనకు తెలిసిందే. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైలు చక్రాలకూ తాళం వేయాల్సి వచ్చింది. హనుమకొండలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలోని వడ్డేపల్లి చెరువు గురువారం ఉద్ధృతంగా ప్రవహించడంతో అటువైపుగా వెళ్లాల్సిన గూడ్సు రైలును కాజీపేట టౌన్ స్టేషన్‌లోనే నిలిపివేశారు. ఈ క్రమంలో రైలు బ్రేకులను లాక్ చేయడంతో పాటు సిబ్బంది ముందు జాగ్రత్తగా చక్రాలను ఇనుప గొలుసులతో పట్టాలకు కట్టి తాళం వేశారు.

  • Loading...

More Telugu News