Amit Shah: మంత్రాలయంలో 108 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణం... వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమిత్ షా

Amit Shah virtually laid foundation stone for Lord Rama statue in Mantralayam

  • మంత్రాలయం శివారులో రాముడి విగ్రహం
  • వీడియో లింక్ ద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ 
  • రూ.300 కోట్ల అంచనా వ్యయం
  • విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల భారీ ఎత్తున శ్రీరాముడి విగ్రహం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణ ప్రారంభోత్సవం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. 

కాగా, ఈ భారీ శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం శివారు ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. కాగా, ఈ విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.

  • Loading...

More Telugu News