Ranga Reddy District: షాద్‌నగర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మందికి తీవ్ర గాయాలు

fire accident in a private factory in shadnagar rangareddy district

  • శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
  • గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్టు వార్త
  • ఘటనలో 11 మందికి గాయాలు
  • క్షతగాత్రులకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స
  • పలువురి పరిస్థితి విషమం 

నగర శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

క్షతగాత్రుల్లో కొందరిని షాద్ నగర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రికి, మిగిలిన వారిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News