బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి వెళ్లారు: సునీల్ దేవధర్
- ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న సునీల్ దేవధర్
- చంద్రబాబు వద్దని జగన్ ను ప్రజలు ఎన్నుకుంటే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిందని విమర్శ
- సోము వీర్రాజు హయాంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని కితాబు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాగానే పని చేశారు... ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ వాస్తవాలను మాట్లాడాలని చెప్పారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని కితాబునిచ్చారు. ప్రజాపోరు యాత్ర ద్వారా పార్టీని వీర్రాజు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.