Uttar Pradesh: జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి బల్లిని మింగేసిన నిందితుడు

Uttarpradesh accused in rape case consumes lizard in a desperate attempt to avoid jail term

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసిన ఘటన
  • బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
  • కోర్టులో విచారణ అనంతరం నిందితుడిని జైలుకు పంపించేందుకు పోలీసుల యోచన
  • జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వణికిపోయిన నిందితుడు
  • పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేసిన వైనం, ఆసుపత్రికి తరలింపు
  • ప్రస్తుతం నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇటీవల ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ క్రమంలో అతడు పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News