Tomato: రూ. 30కే కిలో టమాటా పంపిణీ చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

TDP leader Budda Venkanna sells Tomato in Vijayawada at Rs 30 kilo

  • సొంత డబ్బులతో టమాటాలు కొనుగోలు చేసి పంపిణీ చేసిన బుద్దా వెంకన్న
  • పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్న టీడీపీ నేత
  • ధరలు దిగివచ్చేంత వరకు పంపిణీ చేస్తామని వెల్లడి

ధరలు ఆకాశాన్ని అంటడంతో పేదలు, మధ్యతరగతికి దూరమైన టమాటాలను అతి తక్కువ ధరకే విక్రయించారు, టీడీపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. ప్రస్తుతం కిలో టమాటా ధరలు రూ. 150పైనే పలుకుతుండడంతో ధరలు దిగి వచ్చే వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 30కే కిలో టమాటాలు విక్రయించనున్నట్టు తెలిపారు. పేదలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజూ 500 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

తన సొంత డబ్బులతో టమాటాలు కొనుగోలు చేసిన ఆయన తోపుడుబండిపై తీసుకొచ్చి వన్ టౌన్ రథం సెంటర్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వలంటీర్లతో ఇంటింటికీ రెండు కిలోల టమాటాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News