Pawan Kalyan: ఈ నెల 9న ఏలూరు నుండి పవన్ రెండోదశ వారాహి విజయయాత్ర

Varahi Yatra second phase from 9th of this month

  • గత నెల 14న అన్నవరంలో ప్రారంభమైన తొలిదశ విజయయాత్ర
  • రెండోదశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై నాదెండ్లతో చర్చ
  • ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర రెండోదశ ఈ నెల 9వ తేదీన ఏలూరు నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేత హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి యాత్ర రెండో దశ ఏలూరు నుండి ప్రారంభించడానికి పవన్ కల్యాణ్ సంకల్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్ ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండోదశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News