Indian Railways: త్వరలో ఘోర రైలు ప్రమాదమంటూ దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ

Threatening letter to south central railway

  • గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖ
  • మరో వారం రోజుల్లో ఒడిశా తరహా ప్రమాదం జరగనుందని హెచ్చరిక
  • హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలోనే జరుగుతుందని లేఖలో పేర్కొన్న వ్యక్తులు

దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖ వచ్చింది. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని, మరో వారం రోజుల్లో ఒడిశా తరహా రైలు ప్రమాదం జరగనుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రైలు ప్రమాదం హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలో చోటు చేసుకోనుందని లేఖలో హెచ్చరించారు. ఈ హెచ్చరిక లేఖ గతవారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ విషయమై రైల్వే అధికారులు స్పందించవలసి ఉంది.

  • Loading...

More Telugu News