Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 126 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.59 శాతం లాభపడ్డి ఎస్బీఐ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 63,416కి చేరుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 18,817 వద్ద స్థిరపడింది. రియాల్టీ, బ్యాంకెక్స్, మెటల్, ఇన్ఫ్రా సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.59%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.49%), యాక్సిస్ బ్యాంక్ (1.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.38%), భారతి ఎయిల్ టెల్ (1.37%). 

టాప్ లూజర్స్:
మారుతి (-0.28%), ఐటీసీ (-0.04%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.03%).  

  • Loading...

More Telugu News