శర్వానంద్ పెళ్లిలో పాట పాడి అతిథులను అలరించిన హీరో సిద్ధార్థ్.. వీడియో ఇదిగో!
- లైవ్ కాన్సెర్ట్ లో ఓయ్ సినిమా పాట పాడిన సిద్ధార్థ్
- జైపూర్ లో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరైన టాలీవుడ్ హీరోలు
- మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన సిద్ధార్థ్, శర్వానంద్
స్టేజిపై సిద్ధార్థ్ పాడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలోనూ ఈ పాట పాడింది హీరో సిద్ధార్థే కావడం విశేషం. కాగా, మహాసముద్రం మూవీలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించారు. ఇందులో అదితీరావు హైదరీ కథానాయికగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత హీరోలు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.