Coromandel Express: మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

Coromandel Express Resumes Operations

  • అందుబాటులోకి వచ్చిన ట్రాక్
  • మూడు రోజుల తర్వాత ప్రయాణం ప్రారంభించిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
  • మెసేజీల ద్వారా రిజర్వేషన్ ప్రయాణికులకు సమాచారం

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. 

దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది.

Coromandel Express
Odisha
Balasore Train Tragedy
Chennai
Shalimar
  • Loading...

More Telugu News