Ambati Rambabu: తుప్పు పట్టిన సైకిల్ ను చంద్రబాబు, లోకేశ్ తొక్కలేకపోతున్నారు: అంబటి రాంబాబు

Ambati Rambabu fires on Chandrababu

  • ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబు బతుకు బజారుపాలు అయ్యేదన్న అంబటి
  • టీడీపీకి ఇదే చివరి మహానాడు అని వ్యాఖ్య
  • ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్ దని ప్రశంస

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్ ను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ను వాడుకుని మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు బతుకు బజారుపాలు అయ్యేదని చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు నిజ స్వరూపం గురించి మాట్లాడారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. 

తుప్పు పట్టిన సైకిల్ ను చంద్రబాబు, నారా లోకేశ్ తొక్కలేకపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని చెప్పారు. టీడీపీ బతకడం కష్టమని, వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్ దని అన్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు.

Ambati Rambabu
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News