Sensex: ట్రేడింగ్ చివర్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 99 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.75 శాతం పుంజుకున్న ఎయిర్ టెల్ షేర్ విలువ 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లకు చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 61,873కి చేరుకుంది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 18,321 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.75%), ఐటీసీ (1.76%), కోటక్ బ్యాంక్ (1.17%), ఎల్ అండ్ టీ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.74%). 

టాప్ లూజర్స్:
విప్రో (-1.35%), టాటా మోటార్స్ (-1.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.91%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.79%), సన్ ఫార్మా (-0.79%).

Sensex
Nifty
Stock Market
  • Loading...

More Telugu News