Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూ లైన్

Huge rush in Tirumala

  • విద్యార్థులకు సెలవులు
  • తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు
  • నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
  • శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

ప్రస్తుతం విద్యార్థులకు సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేకుండా వచ్చినవారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోగా... భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. 

కాలినడకన కొండపైకి వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి 5-6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది.

Tirumala
Devotees
Darshan
Lord Venkateswara
TTD
  • Loading...

More Telugu News