Amit Shah: కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం: అమిత్ షా

BJP will come into power in Telangana says Amit Shah

  • కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీ
  • కర్ణాటక ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై నమ్మకం ఉందని వ్యాఖ్య
  • రేపు హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణలో సైతం పూర్తి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

మరోవైపు కర్ణాటకలో ప్రచారాన్ని ముగించుకుని రేపు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. తన పర్యటన సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందంలోని ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. చేవెళ్లలో నిర్వహించే సభలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News