Uttar Pradesh: ఐస్‌క్రీమ్ కొన్నందుకు ఇంట్లో వాళ్లు తిడతారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య

11 year old girl dies by suicide fearing scolding for buying icecream

  • ఉత్తరప్రదేశ్‌, కాన్పూర్ జిల్లా భవానీపూర్ లో షాకింగ్ ఘటన
  • తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఐస్‌క్రీమ్ కొన్న బాలిక
  • ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ చెల్లెలి వార్నింగ్
  • భయపడిపోయిన బాలిక ఆత్మహత్య

ఐస్‌క్రీమ్ కొన్నందుకు ఇంట్లో వాళ్లు తిడతారని భయపడిపోయిన ఓ 11 ఏళ్ల బాలిక అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా భవానీపూర్ గ్రామానికి చెందిన బాలిక ఇటీవల ఓ రోజు ఇంటి ముందుకొచ్చిన బండి వద్ద ఐస్‌క్రీమ్ కొనుక్కుంది. రెండు దోసెళ్ల గోధుమలు ఇచ్చి ప్రతిగా ఐస్‌క్రీమ్ తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక సోదరి తనకూ ఐస్‌క్రీమ్ కావాలని పట్టుబట్టింది. అప్పటికే ఐస్‌క్రీమ్ బండి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. 

దీంతో, పెద్దపెట్టున ఏడుపు అందుకున్న బాలిక ఐస్‌క్రీమ్ కొన్న విషయాన్ని తల్లిదండ్రులు ఇంటికి రాగానే చెబుతానంటూ అక్కను బెదిరించింది. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే తనను తిడతారని భయపడిపోయిన బాలిక చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు సీలింగుకు వెళాడుతున్న బాలికను చూసి నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News