మూడో రోజు ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ, రేపటి విషయంపై రాత్రికి సమాచారమిస్తామన్న సీబీఐ
- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు అవినాశ్
- ఆరు గంటల పాటు కడప ఎంపీని విచారించిన దర్యాఫ్తు సంస్థ
- హైకోర్టు ఆదేశాలపై నేడు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
- ఈ నెల 24 వరకు అరెస్ట్ చేయద్దన్న సుప్రీం
కొన్ని రోజుల క్రితం వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తనను కూడా అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అలాగే 25 వరకు సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్లాలని చెప్పింది. ఈ కారణంగా మూడు రోజులుగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. మరోపక్క, హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఈ నెల 24 వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించింది.