NTR: ఎన్టీఆర్ శతజయంతి.. కేంద్రం కీలక ప్రకటన

Center to release rs 100 coin to commemorate ntr 100 birth anniversary

  • ఎన్టీఆర్ శతజయంతి పురస్కరించుకుని రూ.100 నాణెం విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన
  • వెండి, రాగి లోహ మిశ్రమంతో నాణెం తయారీ
  • నాణేనికి ఓవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం
  • రెండో వైపున ఎన్టీఆర్ చిత్రం

దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 50:50 నిష్పత్తిలోని వెండి-రాగి లోహ మిశ్రమంతో ఈ నాణేన్ని తయారు చేస్తారు. 

దీని చుట్టుకొలత 44 మిల్లీమీటర్లు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, రెండోవైపున ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి అని రాసుంటుంది. 1923-2023 తారీఖును కూడా ముద్రిస్తారు. ఇక కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో నందమూరి అభిమానుల్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది.

NTR
  • Loading...

More Telugu News