buggana: మహిళా సాధికారతపై కవిత చదివిన మంత్రి బుగ్గన

ap minister budget speech in assembly

  • తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పాటుపడుతోందని వెల్లడి
  • మహిళలు స్ఫూర్తిప్రదాతలని పేర్కొన్న ఆర్థిక మంత్రి
  • చప్పట్లతో అభినందించిన ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పాటుపడుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల గురించి రాసిన ఓ కవితను ప్రస్తావించారు.

‘మహిళలు స్ఫూర్తిప్రదాతలు.. తమ అనుభవాలను జీవితపాఠాలుగా మలిచే మణిపూసలు.. మహిళలు ప్రకృతికి మరో రూపాలు.. మహిళలు మహిలో నడయాడే ఆదిపరాశక్తులు’ అంటూ మంత్రి చదివి వినిపించారు.

దీనిపై సభలో ఉన్న మహిళల నుంచి స్పందన రాకపోవడంతో మంత్రి వారివేపు చూస్తూ ‘ఏమ్మా మరోసారి వినిపించనా?’ అని అడిగారు. దీంతో స్పందించిన మహిళా ఎమ్మెల్యేలు చప్పట్లు చరుస్తుండగా మంత్రి మరోమారు కవితను చదివారు. ఈసారి ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ మంత్రి బుగ్గనను అభినందించారు. ఈ క్రమంలో మహిళల కోసం బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు కొన్నింటిని మంత్రి చదివి వినిపించారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించామని బుగ్గన తెలిపారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి రూ.200 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు జరిపినట్లు మంత్రి బుగ్గన తెలిపారు.

buggana
Andhra Pradesh
budget speech
women empowerment
  • Loading...

More Telugu News