Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 415 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 117 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.79 శాతం లాభపడ్డ టాటా మోటార్స్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 60,224కు ఎగబాకింది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 17,711 వద్ద స్థిరపడింది. యుటిలిటీస్, పవర్, ఇన్ఫ్రా సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.79%), ఎన్టీపీసీ (2.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.25%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.93%), ఇన్ఫోసిస్ (1.88%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.22%), ఎల్ అండ్ టీ (-0.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.46%), సన్ ఫార్మా (-0.13%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.10%).

Sensex
Nifty
Stock Market
  • Loading...

More Telugu News