devi: నన్ను గెలిపించాలని జగన్ చెప్పినప్పటి నుంచి కుట్రలు ప్రారంభమయ్యాయి: దేవినేని అవినాశ్

YSRCP will win in East Vijayawada says Devineni Avinash

  • జగన్ కు వస్తున్న ప్రజాదరణను ఓర్చుకోలేకపోతున్నారన్న అవినాశ్ 
  • అన్ని వర్గాల అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారని ప్రశంస 
  • విజయవాడ తూర్పులో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా 

ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వైసీపీ నేత, విజయవాడ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాశ్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలపై పథకం ప్రకారం దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. 

టీడీపీ నేతల్లా జగన్ మాయమాటలు చెప్పడం లేదని, అన్ని వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంతో చేస్తున్నప్పటికీ జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని అన్నారు. నిజాలు బయటపడకుండా ఎల్లో మీడియా అడ్డుపడుతోందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమై, అవినాశ్ ను గెలిపించాలని చెప్పినప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతూనే ఉంటారని... ఎవరు ఎన్ని చేసినా తూర్పు నియోజవర్గంలో తాను గెలవడం, వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News