వీళ్లిద్దరిపై ఆధారపడి వరల్డ్ కప్ గెలవలేం: కపిల్ దేవ్
- ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్న టీమిండియా
- కేవలం కోహ్లీ, రోహిత్ లపైనే ఆధారపడొద్దన్న కపిల్ దేవ్
- జట్టులో ఐదారుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని సూచన
జట్టులో ఒకరిద్దరిపై ఆధారపడే ధోరణి ఎక్కువగా ఉందని, అలా కాకుండా యువ ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐదారుగురు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేసుకోవడం తప్పనిసరి అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
ప్రపంచకప్ సాధించాలంటే సెలెక్టర్లు, టీమిండియా మేనేజ్ మెంట్ కఠినంగా వ్యవహరించకతప్పదని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.
ధోనీ నాయకత్వంలో సొంతగడ్డపై 2011 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా మరో ఐసీసీ టోర్నీలో కప్ గెలవలేకపోయింది.