Jagan: టీడీపీ కార్యకర్తల మృతిపై జగన్ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటించిన సీఎం

Jagan announces exgratia for those families dead in Chandrababu family

  • చంద్రబాబు సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించిన జగన్
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఇంతే మొత్తంలో పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News