Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్ర పేరు ఖరారు.. జనవరి 27న పాదయాత్ర ప్రారంభం

Nara Losh pada yatra name is Yuva Galam

  • లోకేశ్ పాదయాత్రకు 'యువ గళం'గా నామకరణం
  • కుప్పం నుంచి ప్రారంభమై 4 వేల కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర
  • 100 నియోజకవర్గాల గుండా కొనసాగనున్న పాదయాత్ర

వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు 'యువ గళం' అనే పేరును ఖరారు చేశారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. యువత, మహిళలు, రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పాదయత్రను నిర్వహించనున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా పాదయాత్ర కొనసాగనుంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News