Telugudesam: నెల్లూరులో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదిగో

Chandrababu 3 day tour to Nellore begins today

  • ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న చంద్రబాబు
  • 4 నుంచి 5.15 వరకు కందుకూరులో రోడ్ షో
  • ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ
  • రాత్రికి అక్కడే బస

వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నేడు కందుకూరులో పర్యటించనుండగా, రేపు, ఎల్లుండి కావలి, కోవూరులో పర్యటించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి. 

ఈ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 4 గంటలకు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని దివి కొండయ్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తారు. 4 గంటల నుంచి 5.15 వరకు వెంకటనారాయణ నగర్, అంబేద్కర్ విగ్రహం, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.

  • Loading...

More Telugu News