Sasikala: రైలు, ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుపోయి గాయపడిన శశికళ చికిత్స పొందుతూ మృతి

MCA student Sasikala died in hospital

  • విశాఖలోని దువ్వాడలో ఘటన
  • రైలు దిగే ప్రయత్నంలో కిందికి జారిపోయిన విద్యార్థిని
  • అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం
  • మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయిన శశికళ

విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. ప్లాట్ ఫాం పగులగొట్టి ఆమెను కాపాడే సమయానికి బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ విద్యార్థినిని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. దాంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీయే చదువుతోంది. ఆమె మరణవార్తలో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది. 

కంపార్ట్ మెంట్ నుంచి కిందికి దిగే ప్రయత్నంలో వెనుక నుంచి డోర్ బలంగా ఢీకొనడంతో శశికళ ప్రమాదవశాత్తు కిందికి జారిపోయింది. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుని గంటల కొద్దీ నరకయాతన చవిచూసింది. రైల్వే రెస్క్యూ టీం స్పందించి ప్లాట్ ఫాంను పగులగొట్టినా, అప్పటికే ఆమెకు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి.

Sasikala
Student
Death
Train
Platform
Duvvada
Visakhapatnam
  • Loading...

More Telugu News