Vijayasai Reddy: టీవీ ఛానల్ పెడుతున్నా: విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన

Vijayasai Reddy announces TV Channel

  • పేపర్, టీవీ ఉందని రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారన్న విజయసాయి
  • రామోజీ ఉన్న రంగంలోకే ప్రవేశిస్తున్నానని వెల్లడి
  • ఎవరి ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందామని సవాల్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీవీ ఛానల్ ను పెట్టబోతున్నానని విశాఖలో మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడిన ఆయన... రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్, టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని... ఏ మీడియా రంగంలో అయితే రామూ (రామోజీరావు) ఉన్నారో... అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నానని చెప్పారు. మీ ఛానల్ ఎలా పనిచేస్తుందో ... తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ అంటూ సవాల్ విసిరారు. మీ రంగంలోకి తాను ఎంటర్ కాబోతున్నానని వ్యాఖ్యానించారు.

మరోవైపు, విజయసాయిరెడ్డి ప్రకటనపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నువ్వు పెడుతున్న ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
TV Channel
Ramoji Rao
  • Loading...

More Telugu News