West Bengal: 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు.. చివరి భార్య ఫిర్యాదుతో అరెస్ట్

West Bengal Man Marries 24 women arrested

  • పశ్చిమ బెంగాల్ ‌లో ఘటన
  • పెళ్లయిన కొన్నాళ్లకు డబ్బు, నగలతో పరార్
  • పలు పేర్లతో బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో తిరుగుతూ యువతులకు వల

పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిత్యపెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. నిండా 30 ఏళ్లు కూడా లేని ఓ యువకుడు ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను కూడా మోసం చేసి వెళ్లిపోయాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన ఆమె ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. నిందితుడు అసబుల్ మొల్లా (28) సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల వరకు బాగానే ఉన్న అసబుల్.. ఆ తర్వాత ఇంట్లోని నగలు తీసుకుని పారిపోయాడు. తాను మోసపోయినట్టు గ్రహించిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. 

నకిలీ గుర్తింపు కార్డులతో బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక మహిళలను వలలో వేసుకునే వాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అయ్యేవాడు. ఇలా మొత్తం 23 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారందరినీ మోసగించి ఇంట్లోంచి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యేవాడు. మోసపోయినట్టు గుర్తించిన వారందరూ ఫిర్యాదుకు ముందు రాకపోయినప్పటికీ 24వ మహిళ ధైర్యం చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

West Bengal
Marriage
Crime News
  • Loading...

More Telugu News