Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్

Markets ends in losses

  • 1,093 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 346 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం పతనమైన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు బ్లాక్ ఫ్రైడే గా మిగిలిపోయింది. మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మన మార్కెట్లపై కూడా దీని ప్రభావం పడింది. 

ఈ నేపథ్యంలో, ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు పతనమవుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,093 పాయింట్లు నష్టపోయి 58,840కి పడిపోయింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 17,530కి దిగజారింది. రియాల్టీ, ఐటీ, టెక్ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రమే (2.63%) లాభపడింది. అల్ట్రాటెక్ సిమెంట్ (-4.51%), టెక్ మహీంద్రా (-4.45%), ఇన్ఫోసిస్ (-3.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.58%), విప్రో (-3.19%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News