Telangana: తెలంగాణలో తాజాగా 152 మందికి కరోనా పాజిటివ్

Telangana state corona report

  • గత 24 గంటల్లో 12,820 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 60 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 145 మంది
  • ఇంకా 1,011 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,820 కరోనా పరీక్షలు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 408 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,35,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,367 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,011 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

Telangana
Corona Virus
Daily Report
New Cases
  • Loading...

More Telugu News