Gold Coins: వంటగదిలో నిధి... తవ్విచూస్తే రూ.2.3 కోట్ల విలువైన బంగారు నాణేలు

Britain couple found gold coins in their kitchen
  • బ్రిటన్ లో ఘటన
  • పాత ఇంట్లో పనులు చేపట్టిన జంట
  • కిచెన్ లో తవ్వుతుండగా క్యాన్ లభ్యం
  • క్యాన్ లో 264 బంగారు నాణేలు
  • 400 ఏళ్ల నాటి నాణేలు.. త్వరలో వేలం
పూర్వకాలంలో రాజులు, జమీందారులు భద్రపరిచిన నిధినిక్షేపాలు ఇప్పటికీ అక్కడక్కడా బయల్పడుతుంటాయి. బ్రిటన్ లో ఓ జంటకు చెందిన ఇంటిలోనూ ఇలాంటి నిధే బయటపడింది. వంట గదిలో తవ్విచూస్తే ఏకంగా 264 బంగారు నాణేలు కనిపించాయి. వాటి విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఈ నాణేలు 400 ఏళ్ల నాటివని భావిస్తున్నారు. నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించారు. 

కాగా, ఆ దంపతులు తమ పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇదే ఇంటిలో తాము గత పదేళ్లుగా ఉంటున్నామని తెలిపారు. ఎల్లెర్బీ గ్రామంలో ఈ జంటకు ఓ ఇల్లు ఉంది. ఇది చాలా పాత ఇల్లు కావడంతో వారు ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో కిచెన్ లో ఫ్లోర్ బోర్డు తొలగించగా, ఓ లోహపు క్యాన్ లో భద్రంగా ఉన్న బంగారు నాణేలు దర్శనమిచ్చాయి. 

కిచెన్ లో తవ్వుతున్న సమయంలో గట్టిగా తగలడంతో ఏదైనా విద్యుత్ వైర్ల పైపు అయ్యుంటుందని ఆ దంపతులు భావించారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. దాంట్లో బంగారు నాణేలు ఉండడంతో ఆ జంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. 

ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. అప్పట్లో ఎవరైనా వాణిజ్య ప్రముఖుడి కుటుంబానికి చెందినవి అయ్యుంటాయని స్థానిక మీడియా పేర్కొంది.
Gold Coins
Couple
Kitchen
Britain

More Telugu News