Telangana: తెలంగాణలో కనిష్ఠ స్థాయికి కరోనా రోజువారీ కేసులు... వివరాలు ఇవిగో!

Telangana corona media bulletin

  • గత 24 గంటల్లో 14,320 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 80 కొత్త కేసులు
  • వెయిటింగ్ లో 601 ఫలితాలు
  • కరోనా నుంచి కోలుకున్న 345 మంది
  • ఇంకా 1,924 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 14,320 శాంపిల్స్ పరీక్షించగా, 192 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 80, రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 601 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,34,143 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,28,108 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,924 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
Media Bulletin
Positive Cases
  • Loading...

More Telugu News