Telangana: తెలంగాణలో తాజాగా 338 మందికి కరోనా

Telangana corona bulletin details

  • గత 24 గంటల్లో 24,113 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 135 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 507 మంది
  • ఇంకా 2,553 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,113 శాంపిల్స్ పరీక్షించగా, 338 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 135 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి. మరో 539 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 

అదే సమయంలో, 507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 8,32,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,26,269 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,553 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Bulletin
Details
New Cases
  • Loading...

More Telugu News